పాపం.. వారి వంట, పడుకోవడం అంతా రైల్వే ట్రాక్ పైనే

పాపం.. వారి వంట, పడుకోవడం అంతా రైల్వే ట్రాక్ పైనే

ముంబైలోని మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లోని లోకల్ రైలు పట్టాలపై ప్రజలు కూర్చుని వంటలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆందోళన చెందడమే కాకుండా అధికారులు నిర్లక్ష్యం పట్ల ఆగ్రహంగా కూడా ఉన్నారు. 

ఈ వీడియోలో పలువురు మహిళలు రైల్వే ట్రాక్ లపైనే ఆహారాన్ని తయారు చేస్తుండగా.. కొందరు బాలికలు అక్కడే చదువుకుంటున్నారు. దీంతోపాటు పిల్లలు పరుగులు పెడుతూ ఆటలు ఆడుతున్నారు. కొంతమంది  వ్యక్తులు ట్రాక్ లపై పడుకోవడం కూడా కనిపిస్తుంది. 

ఈ వీడియోను 21 వేల మంది నెటిజన్లు చూశారు. ప్రమాదకరమైన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

వీడియో చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. దయచేసి ఎవరైనా దీనికి చర్య తీసుకోండి అంటూ రాశాడు. మరో నెటిజన్ మీ జీవితం అక్షరాలా ట్రాక్ లో ఉంది అంటూ హాస్యంగా రాశాడు.