ఖమ్మం, వెలుగు: ఇన్స్టంట్ లోన్, ఒక్క క్లిక్ తో లోన్మీ సొంతం అంటూ ఊరిస్తారు. డాక్యుమెంట్స్అవసరం లేదు. సిబిల్స్కోర్తో పనిలేదంటూ ఊదరగొడుతారు. ఈ ఆఫర్లకు ఆకర్షితులై వారి ట్రాప్లో పడ్డామో.. ఇక అంతే సంగతి. వారు పంపిన లింక్నుంచి యాప్ లోన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక మీ ఫోన్మోసగాళ్ల చేతికి చిక్కినట్టే. మీ ఫోన్లోని కాంటాక్ట్నంబర్లతో సహా ఫొటోలు, మీ పర్సనల్డేటా అంతా వారికి చిక్కుతుంది. లోన్తీసుకొని టైంకు కట్టకున్నా.. లేటు అయినా.. టార్చర్స్టార్టవుతుంది. ఓ వైపు లోన్యాప్ల నుంచి డబ్బులు తీసుకోవద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నా, జిల్లాలో ఏదో ఒక చోట బాధితులు బయటపడుతూనే ఉన్నారు.
యూజర్లు జాగ్రత్తగా ఉండాలె..
గూగుల్ ప్లేస్టోర్లో 600కు పైగా ఇన్స్టంట్ లోన్ యాప్లు ఉన్నాయి. ఇందులో 27 యాప్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బ్లాక్ చేసింది. మరో 137 యాప్ల లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది. ఆ యాప్ల పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది. ఇక జిల్లాలో పోలీసులు కూడా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సైబర్ దోస్త్ ద్వారా ఇలాంటి లోన్ యాప్లపై ప్రచారం చేస్తున్నారు. ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడే యూజర్ ఫోన్కు సంబంధించిన డేటా, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్స్ను యాక్సెస్ చేసుకునేలా పర్మిషన్స్ఇవ్వాల్సి ఉంటుంది. అలా లోన్ కావాలంటే తప్పనిసరిగా కండిషన్స్కు ఓకే చెప్పాల్సి రావడం, ఆ తర్వాత లోన్ తీసుకున్న వారి పాలిట శాపంగా మారుతోంది. లోన్ కట్టకపోయినా, లేట్అయినా, వారు అడిగినంత చెల్లించకపోయినా వారి టార్చర్స్టార్ట్అవుతుంది. లేడీస్ ఫొటోలను మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో పెడతామని హెచ్చరిస్తున్నారు. మాట వినని వాళ్ల మార్ఫింగ్ చేసిన అర్ధనగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తున్నారు. అప్పటికే వారి బంధువులు, ఫ్రెండ్స్ కాంటాక్ట్ నంబర్స్ పంపించి ఇజ్జత్ తీస్తున్నారు. చిన్న అమౌంట్ కోసం లోన్ యాప్ల జోలికి వెళ్లొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
లోన్ చెల్లించినా టార్చర్ తప్పడం లేదు..
లోన్ డబ్బు తిరిగి చెల్లించినా కూడా యాప్ నిర్వాహకుల నుంచి బాధితులకు వేధింపులు తప్పడం లేదు. దీంతో అప్పటికప్పుడు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఉపయోగం లేకుండా పోతోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లు చైనాలో తయారైనవి కావడం, నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తుండడంతో వాళ్లను ట్రాక్ చేయడం, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం సాధ్యం కాకపోవడంతో ఇలాంటి కేసులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి యాప్ల పట్ల అలెర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు.
యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటూ లింకులు
మధిరకు చెందిన వింజమూరి ప్రదీప్ ఓ లోన్యాప్ ద్వారా రూ.5 వేలు లోన్ తీసుకున్నాడు. వారం రోజుల్లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత రూ.3,500 చొప్పున రెండు సార్లు లోన్ తీసుకున్నాడు. గడువు లోగా తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తే, యాప్, వెబ్ సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటూ లింకులు పంపారు. వారు పంపిన యూపీఐ ఖాతాకు మొత్తం పేమెంట్ చేసిన తర్వాత కూడా, ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్కు ఫోన్ చేసి టార్చర్పెట్టారు. మరో రూ.1,500 కట్టకపోతే మీ అమ్మ ఫొటోను మార్ఫింగ్ చేసి బూతు సైట్లలో పెడతామని బెదిరించారు. ప్రదీప్ ఫోటో మీద కాల్ గర్ల్స్ కావాలంటే ఫోన్ చేయాలంటూ అతని నంబర్ ఇచ్చి, అతని కాంటాక్ట్ నంబర్స్ కు ఫార్వర్డ్ చేశారు. దీంతో ప్రదీప్ మధిర పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
లింగయ్య ఫొటోలను అర్ధనగ్నంగా..
వైరాకు చెందిన కొక్కిరేణి లింగయ్యకు అతని ఫ్రెండ్ ఓ యాప్ గురించి చెప్పి, అతని ఫోన్లో ఇన్స్టాల్ చేశాడు. ఆ యాప్ నుంచి లింగయ్య రూ.3 వేలు లోన్ తీసుకున్నాడు. మొదటి విడతగా రూ.1100 చెల్లించాడు. ఇంకో రెండు ఇన్ స్టాల్ మెంట్ లను యాప్ ఎగ్జిక్యూటివ్ పంపిన లింక్ ల ద్వారా కట్టేశాడు. అయినా, ఇంకా ఇన్స్టాల్ మెంట్లు కట్టలేదంటూ లింగయ్య ఫొటోలను అర్ధనగ్నంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. లింగయ్య చెల్లి , తల్లి ఫొటోలపై కూడా అసభ్య కామెంట్లతో బంధు మిత్రులకు పంపించారు. దీంతో బాధితుడు లింగయ్య వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇన్స్టంట్ లోన్ యాప్లను నమ్మొద్దు
ఇన్స్టంట్లోన్లు ఇస్తామంటూ ఆఫర్చేసే యాప్లను నమ్మొద్దు. బ్యాంక్ లు, ఫైనాన్షియల్ గా ట్రస్టెడ్ కంపెనీలు తప్పించి ఇతర గుర్తింపులేని యాప్ల జోలికి పోవద్దు. నగదు లావాదేవీల విషయంలో రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. సైబర్ దోస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.
- విష్ణు ఎస్.వారియర్, ఖమ్మం పోలీస్ కమిషనర్