మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటుచేసిన గాంధీ శిల్ప బజార్ హస్తకళా ఉత్సవం ఆకట్టుకుంటోంది. ఈ మేళాలో హస్తకళా ఉత్పత్తులను సందర్శించేందుకు ప్రజలు వస్తుండగా.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అంపీ థియటర్లో చంద్రకళా నిలయం గురువు సంతోష్ పెరుమాండ్ల శశిహాయ్ బృందంతో పేరిణి లాస్యం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. – వెలుగు, మాదాపూర్
