జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇంకా జీతం పడలే

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇంకా జీతం పడలే

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతం పడలేదు. ఈ నెల 1న రావాల్సిన జీతాలు 13వ తేదీ వచ్చినా అందకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 

ALSO READ: పెంచిన జీతాలు ఇయ్యకుంటే వంట బంద్

కొన్ని నెలలుగా ఇదే విధంగా జీతాలు ఆలస్యమవుతున్నప్పటికీ పట్టించుకునే వారు లేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ తేదీ దాటినా వేతనాలు అందకపోవడంతో ఇన్​టైమ్​లో ఈఎంఐలు చెల్లించలేక చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని వాపోయారు. ఒకటో తేదీన జీతాలు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.