చిరు, బాలయ్య సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

చిరు, బాలయ్య సినిమాలకు  తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు సినిమాలకు ఆరో ఆటకు అనుమతి ఇచ్చింది. సినిమాల రిలీజ్ రోజున ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చునని పేర్కొంది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థనపై స్పందించిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి  చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‭తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే రిలీజైన చిత్ర ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి తెరకెక్కగా,  వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబీ డైరక్షన్ చేశారు. ఈ రెండు చిత్రాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.