
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాకి పదవి పోయినా.. అధికార మదం ఇంకా పోలేదన్న నాని.. సీఎం YS జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం సరైంది కాదన్నారు. ఏరా ఉమా అని పిలవడానికి తనకు సంస్కారం అడ్డొస్తోందన్నారు పేర్ని.
పబ్లిసిటీ కోసం చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు నాని. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్ల హక్కుల్ని వదిలేసి.. కేసుల భయంతో రాత్రికిరాత్రే పారిపోయి వచ్చింది చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కాదా అని ప్రశ్నించారు పేర్నినాని.