
వెలుగు: యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదా నుంచి బాలివుడ్ స్టార్ ప్రియాంక చోప్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్లో పిటిషన్ నమోదైంది. పాక్ భూబాగంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఐఏఎఫ్ను మెచ్చుకుంటూ ‘జై హింద్ ’ అని ఫిబ్రవరి 26న ప్రియాంక చేసిన ట్వీట్ పై పాక్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ట్వీట్ యుద్ధానికి మద్ధతిచ్చేలా ఉందంటూ వెయ్యి మందికిపైగా సంతకాలు చేసిన పాక్ నెటిజన్లు ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. యునిసెఫ్కు అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక శాంతియుతంగా.. లేదంటే న్యూట్రల్ గా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఆమెను అంబాసిడర్ నుంచి తప్పించాలంటూ యూఎన్, యునిసెఫ్ హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ప్రియాంక నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యునిసెఫ్కూడా పిటిషన్ స్వీకరించినట్లు ధ్రువీకరించలేదు.