మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నారు. పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి వరుగా పెరిగి రేట్లు... నిన్న పెరగలేదు. ఇవాళ మళ్లీ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్  పెట్రోల్  92 రూపాయల 34 పైసలు కాగా... డీజిల్ 82 రూపాయల 95 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్  93 రూపాయల 36 పైసలకు చేరగా... డిజిల్  89 రూపాయల 75 పైసలకు వచ్చింది. హైదరాబాద్ లో పెట్రోల్  95 రూపాయల 97 పైసలు ఉండగా...డీజిల్ 90 రూపాయల 43లకు పెరిగింది. ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్  రేట్లు పెరిగాయి. పెట్రోల్ పై ఓవర్ ఆల్ గా ఎనిమిది రోజుల్లో  రూపాయి 94 పైసలు పెరగ్గా డీజిల్ పై 2 రూపాయల 22 పైసలకు హైక్ అయ్యింది. దేశ వ్యా ప్తంగా పెట్రోల్ ,  డీజిల్  ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని పలు చోట్ల లీటర్  పెట్రోల్  100 మార్క్ ను దాటింది.