మే నెలలో 12 సార్లు పెరిగిన పెట్రో ధరలు

మే నెలలో 12 సార్లు పెరిగిన పెట్రో ధరలు

దేశంలో పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్  పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయల 21 పైసలకు, డీజిల్ ధర 84 రూపాయల 7పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు దగ్గరైంది. పెట్రోల్ ధర 99 రూపాయల 49పైసలుగా ఉంది. హైదరాబాద్ లో 96 రూపాయల 88 పైసలు, డీజిల్ 91 రూపాయల 65 పైసలుగా ఉంది. 

ఈ నెలలో పెట్రో ధరలు పెరగడం ఇది 12వ సారి. ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ పై ధర 2 రూపాయల 82 పైసలు, డీజిల్ పై 3 రూపాల 34 పైసలు ఇంధన సంస్థలు పెంచాయి. దాంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి.