సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ

జమ్ము కశ్మీర్ బరాముల్లా జిల్లా సోపోర్‌‌లో పెట్రో బాంబు దాడి జరిగింది. బుర్ఖా ధరించిన ఓ మహిళ సంచిలో పెట్రోల్ బాంబును తీసుకొచ్చి నిప్పు అంటించి.. సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై విసిరి పరారైంది. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ఆ పెట్రోల్ బాంబు మహిళ చేతిలోనే పేలినంత పనవడంతో.. టార్గెట్ వరకు పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మహిళ పెట్రోల్ బాంబును విసిరిన ఘటన సీసీటీవీ రికార్డ్ అయింది. దీని ఆధారంగా ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపడుతున్నారు. సోపోర్‌‌లో నిన్న సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై ఓ మహిళ పెట్రోల్ బాంబు విసిరిందని, ఆమెను ఇప్పటి గుర్తించామని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

జుట్టు బలంగా ఉండి నల్లగా మెరిసిపోవాలంటే..

మంచు మనోజ్‌కు పోలీసుల ఫైన్

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం