
నష్టాల కన్నా లాభాలే ఎక్కువున్నయ్
అమెరికా గవర్నమెంట్కు
ఎఫ్డీఏ కమిటీ సిఫార్సు
వచ్చే వారం వ్యాక్సిన్ను
ఎఫ్డీఏ ఆమోదించే అవకాశం
వాషింగ్టన్: ఫైజర్–బయోఎన్టెక్ కలిసి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్కు అమెరికాలో దాదాపు లైన్ క్లియర్ అయిం ది. వ్యాక్సిన్తో లాభాలే ఎక్కువున్నాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్స్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వైజరీ కమిటీ(వీఆర్బీపీఏసీ) చెప్పింది. ఎలాంటి జంకు లేకుండా జనానికి వ్యాక్సిన్ వేయొచ్చని సిఫార్సు చేసింది. కమిటీలోని 17 మంది సభ్యులు వ్యాక్సిన్ బాగుందని చెప్పగా, నలుగురు మాత్రం ఇంకా టెస్టులు చేయాల్సి ఉందన్నారు. ‘‘వ్యాక్సిన్ బాగా పనిచేస్తోంది. దానితో మస్తు లాభాలున్నాయి. రిస్క్ చాలా తక్కువ’’ అని కమిటీ మెంబర్, ఫిలడెల్ఫియా చిల్డ్రెన్స్ హాస్పిటల్ వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ పాల్ ఓఫిట్ అన్నారు. కమిటీ సూచనలకు తగ్గట్టు వ్యాక్సిన్ను ఎఫ్డీఏ అధికారికంగా ఆమోదించడం ఒక్కటే మిగిలి ఉంది. కమిటీ సూచనలను ఎఫ్డీఏ కెరీర్ స్టాఫ్ రివ్యూ చేస్తున్నారని, ఎమర్జెన్సీ వాడకంపై వాళ్లు తేల్చిన తర్వాత వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎఫ్డీఏ కమిషనర్ స్టీఫెన్ ఎం. హన్ చెప్పారు. వ్యాక్సిన్ను ఎఫ్డీఏ ఆమోదించాక.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన అడ్వైజర్లు వ్యాక్సిన్ డేటాను మరోసారి పరిశీలించనున్నారు.
ఎయిడ్స్ యాంటీబాడీలొచ్చినయ్
కరోనా వ్యాక్సిన్ వేస్తే.. కరోనా యాంటీబాడీలు రావాలి. కానీ, ఆస్ట్రేలియాలో కొందరు వాలంటీర్లకు హ్యూమన్ ఇమ్యునో వైరస్(హెచ్ఐవీ) ఎయిడ్స్ యాంటీ బాడీలు తయారయ్యాయి. దీంతో ట్రయల్స్ మొత్తాన్ని ఆస్ట్రేలియా సర్కార్ బంద్ పెట్టేసింది. కరోనా వ్యాక్సిన్ ఫేజ్1 ట్రయల్స్లో భాగంగా 216 మంది వలంటీర్లకు క్వీన్స్ల్యాండ్వర్సిటీ తయారు చేసిన వీ451 అనే కరోనా వ్యాక్సిన్ను ఇచ్చారు. వాలంటీర్లు కొందరిలో ఎయిడ్స్కు కారణమయ్యే హెచ్ఐవీలోని ప్రొటీన్ జీపీ41 ఆనవాళ్లు బయటపడ్డాయని వర్సిటీ, వ్యాక్సిన్ తయారీ కంపెనీలు చెప్పాయి. దీనిపై ప్రభుత్వంతో చర్చించాక, ఫేజ్2, ఫేజ్3 ట్రయల్స్ను ఆపేయాలని డిసైడ్ అయ్యామని చెప్పాయి.