కేసీఆర్​ డైరెక్షన్​లోనే ఫోన్ ట్యాపింగ్

కేసీఆర్​ డైరెక్షన్​లోనే ఫోన్ ట్యాపింగ్

 ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్​ వేసిన స్కెచ్​లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్టయిన టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. వీటిని రాధాకిషన్​రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. 

నాడు దుబ్బాక, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మునుగోడు బై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారు. ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే  2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా నాటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావుతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలుమార్లు మీటింగ్స్​ జరిపారు. 

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి వారంలో నాటి టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధాకిషన్ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని రాధాకిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు ప్రభాకర్​రావు సూచించారు. ఇందుకు తగ్గట్టుగా నాటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓటీ చీఫ్ ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిఘా పెట్టింది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులను ఆ టీమ్​ పూర్తిగా తమ సర్వెలైన్స్​లోకి తీసుకుంది. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది. 

ఆ ఆడియో క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరవేసింది. ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాలని సూచించారు. ఇందులో భాగంగా నందుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామచంద్ర భారతి, సింహయాజీతో రోహిత్​రెడ్డి పలుమార్లు మాట్లాడారు. వీరి సంభాషణలు అన్నీ రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో మొయినాబాద్ అజీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాపింగ్​కు కేంద్రంగా ఎంచుకున్నారు.