ఒక దోమ వల్ల 8 రోజులు నరకం.. అందుకే అది తప్పనిసరి!

ఒక దోమ వల్ల 8 రోజులు నరకం.. అందుకే అది తప్పనిసరి!

బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఒక దోమ వల్ల నరకం అనుభవించారట. ఆ కారణంగా తన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చిందట. ఆ విషయంలో తాను పడ్డ బాధను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. భూమి పెడ్నేకర్ కొని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దానికి ఆమె అనారోగ్యానికి కారణాన్ని వివరిస్తూ ఒక నోట్ కూడా రాశారు.. ఒక దోమ వల్ల గత 8 రోజులుగా నరకం అనుభవించాను. దాదాపు వారం రోజులుగా ఇవాళే ఉదయాన్నే నిద్ర లేచాను. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇన్నిరోజులు నా కుటుంబానికి దూరంగా ఉండడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అందరూ దోమలను చంపే పరికరాలను వాడండి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి. అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి కారణమవుతుంది.. అంటూ జాగ్రత్తలు చెప్పింది ఈ బ్యూటీ.. అది చూసిన ఆమె ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ భూమి పెడ్నేకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక భూమి పెడ్నేకర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్ తో మేరీ పట్నీ కా రీమేక్ అనే మూవీ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి.. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.