కొరియర్‎లో 92 కత్తులు

కొరియర్‎లో 92 కత్తులు

మహారాష్ట్రలో కొరియర్ కంపెనీ నుంచి పోలీసులు 92 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పింప్రి చించ్వాడ్‎లోని ఢిఘి ప్రాంతంలోని కొరియర్ కంపెనీలో కత్తులు గుర్తించారు. కత్తుల విలువ 3 లక్షల 70 వేలుగా ఉంటుందని పింప్రి  చించ్వాడ్ సీపీ కృష్ణ ప్రకాశ్ తెలిపారు. ఈ పార్శిల్‎ను పంజాబ్ నుంచి ఔరంగాబాద్‎కు డెలివరీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీపీ చెప్పారు.

కాగా.. ఐదు రోజుల క్రితమే ఔరంగాబాద్‎లో పోలీసులు 37 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తులు కూడా పంజాబ్ నుంచే కొరియర్ రావడం గమనార్హం.

For More News..

రెండు వారాల్లో రూ. 10 పెరిగిన పెట్రోల్ రేటు

రూపాయికే కిలో ఉల్లి అమ్మిన రైతులు