మహారాష్ట్రలో కొరియర్ కంపెనీ నుంచి పోలీసులు 92 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పింప్రి చించ్వాడ్లోని ఢిఘి ప్రాంతంలోని కొరియర్ కంపెనీలో కత్తులు గుర్తించారు. కత్తుల విలువ 3 లక్షల 70 వేలుగా ఉంటుందని పింప్రి చించ్వాడ్ సీపీ కృష్ణ ప్రకాశ్ తెలిపారు. ఈ పార్శిల్ను పంజాబ్ నుంచి ఔరంగాబాద్కు డెలివరీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీపీ చెప్పారు.
Maharashtra | Pimpri Chinchwad police seized swords from a courier firm's office in Dighi area
— ANI (@ANI) April 4, 2022
We've recovered 92 swords, 2 kukris & 9 scabbards worth Rs 3.7 lakhs. The consignment was supposed to be delivered to Aurangabad: Krishna Prakash, Pimpri Chinchwad Police commissioner pic.twitter.com/jo9tlZ5tPm
కాగా.. ఐదు రోజుల క్రితమే ఔరంగాబాద్లో పోలీసులు 37 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తులు కూడా పంజాబ్ నుంచే కొరియర్ రావడం గమనార్హం.
For More News..