ఆదరించండి.. అభివృద్ధి చేస్త : జగదీశ్వర్ గౌడ్

ఆదరించండి.. అభివృద్ధి చేస్త : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. బుధవారం హఫీజ్​పేట డివిజన్​లోని ఓల్డ్ హఫీజ్ పేట గ్రామం, సాయినగర్, యూత్ కాలనీలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామన్నారు.