మాదాపూర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. బుధవారం హఫీజ్పేట డివిజన్లోని ఓల్డ్ హఫీజ్ పేట గ్రామం, సాయినగర్, యూత్ కాలనీలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామన్నారు.