ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసల వర్షం

ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసల వర్షం

జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ శక్తిమంతమైన, డైనమిక్ లీడర్ అని ఆయన మెచ్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయంలో మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు ఆదివారం జైపూర్ కు థరూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. రాజకీయంగా మోడీ చైతన్యవంతంగా ఉంటారన్నారు. మోడీ సారథ్యంలో బీజేపీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని తాము ఊహించలేదన్నారు. కానీ ఆయన నెగ్గి చూపించారన్నారు. భారతీయ ఓటర్లు ఎవ్వరికైనా షాక్ ఇవ్వగలరని.. ఒకరోజు బీజేపీకి కూడా వాళ్లు షాక్ ఇస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కాషాయ పార్టీ ఏం కోరుకుంటే అదే జరుగుతోందన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై శ‌శి థ‌రూర్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ కోసం విశేషంగా ప్రచారం చేశారన్నారు. అయితే ఒక వ్య‌క్తి ప్ర‌చారం వ‌ల్ల కాంగ్రెస్ ను త‌ప్పుపట్టొచ్చని తాను అనుకోవ‌డం లేద‌ని తెలిపారు. గత 30 ఏళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ మనుగడకు సంబంధించిన సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నాయని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

గాంధీ ఫ్యామిలీ త్యాగాలకు ఎప్పుడూ సిద్ధమే

బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు