గాంధీ ఫ్యామిలీ త్యాగాలకు ఎప్పుడూ సిద్ధమే

గాంధీ ఫ్యామిలీ త్యాగాలకు ఎప్పుడూ సిద్ధమే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తన పదవి నుంచి తప్పుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురీ అన్నారు. పార్టీ కోసం తమ పోస్టులను త్యాగాలు చేసేందుకు సోనియా ఫ్యామిలీ రెడీగా ఉందన్నారు. ఆదివారం జరిగిన పార్టీ మీటింగ్ లో తాను బాధ్యతల నుంచి తప్పించుకుంటానని సోనియా చెప్పారని.. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అందుకు ఒప్పుకోలేదన్నారు. సోనియానే పార్టీ చీఫ్ గా కొనసాగాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఆమె సారథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధానంగా సంస్థాగత బలహీనతలు అధిగమించి, పార్టీలో సమగ్రమైన మార్పులు తీసుకురావాలని సోనియాకు వివరించామన్నారు.

కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమవుతుందనే భావనలో ఉన్న అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ పునర్నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రజా ఉద్యమాలు చేపట్టి.. పార్టీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. వ్యూహాలు పక్కాగా అమలు చేయకపోవడంతోనే ఓడిపోయామని కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారు. దీన్ని సవాలుగా తీసుకుని ముందుకెళ్లాలని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్

కశ్మీర్ పండిట్లను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తరిమికొట్టాయి

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు