దీదీకి మోడీ కంగ్రాట్స్.. అండగా ఉంటామని హామీ

దీదీకి మోడీ కంగ్రాట్స్.. అండగా ఉంటామని హామీ

న్యూఢిల్లీ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ పార్టీకి ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు తృణమూల అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అభినందిస్తూ మోడీ ఓ ట్వీట్ చేశారు. ‘బెంగాల్ విక్టరీ కొట్టిన దీదీ మమతా బెనర్జీకి కంగ్రాట్స్. బెంగాల్ ప్రజల కలలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి అవసమైన సహాయ, సహకారాలను కేంద్రం అందిస్తుంది. ఈ కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకూ కేంద్రం సాయం అందిస్తుంది’ అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ 214 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా సీట్లు కైవసం చేసుకుంది. అయితే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌‌లో బీజేపీ నేత, తన మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.