ఇజ్రాయెల్​ ఎన్నికల్లో మోడీ!

ఇజ్రాయెల్​ ఎన్నికల్లో మోడీ!

తమ ప్రమేయం లేకుండానే మోడీ, ట్రంప్​, పుతిన్​ లాంటి ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారంలో దర్శనమిస్తున్నరు. సెప్టెంబర్​ 17న జరగనున్న ఎన్నికల కోసం అక్కడి పార్టీలు రకరకాలుగా క్యాంపెయిన్​ చేస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని, ‘లికుడ్​ పార్టీ’ చీఫ్​ బెంజిమెన్​ నెతన్యాహు కాస్త వెరైటీగా వరల్డ్​ లీడర్లను వాడేసుకుంటున్నారు. మోడీ, ట్రంప్​, పుతిన్​ తదితరులతో దిగిన ఫొటోల్ని దేశమంతటా ఫ్లెక్సీలుగా వేయించారు. తద్వారా నెతన్యాహును ప్రపంచం మెచ్చిన నేతగా ఫోకస్ చేయడంతోపాటు ఇతరదేశాల మూలాలున్న ఓటర్లనూ ఆకట్టుకోవడం లికుడ్​ పార్టీ ఎత్తుగడ అని ఇజ్రాయెలీ జర్నలిస్టులు అంటున్నారు. టెల్​అవీవ్​ సిటీలో లికుడ్​ పార్టీ హెడ్​క్వార్టర్​ వద్ద ఏర్పాటుచేసిన ప్రచారచిత్రమిది.