ట్రంప్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నాడు.. రాహుల్ గాంధీ

ట్రంప్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నాడు.. రాహుల్ గాంధీ

ప్రధాని మోదీపై కాంగ్రెస్​ఎంపీ రాహుల్​మరోసారి మండిపడ్డారు. భారత్,రష్యా ఆయిల్​ డీల్​పై అమెరికా అధ్యక్షుడి ట్రంప్​మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ట్రంప్‌ను చూసి భయపడుతున్నారు..భారత్, రష్యా చమురును కొనుగోలు వ్యవహారంపై ట్రంప్ నిర్ణయించడం, ప్రకటించేంతగా లీనియన్స్​ఇస్తున్నాకగ.. అమెరికా పదే పదే తిడుతుంటే కూడా వారిని అభినందిస్తూ , పొగడ్తూ మేసేజ్​లు పంపుతున్నారు.. ట్రంప్​ బెదిరింపులకు మోదీ భయపడ్డారని రాహుల్​ విమర్శించారు. 

భారత్,రష్యా ఆయిల్​ డీల్​పై ట్రంప్​ ఏమన్నారంటే.. 

భారత్, రష్యా ఆయిల్​ డీల్​పై బుధవారం ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు.  రష్యానుంచి భారత్​ ఆయిల్ కొనుగోలు చేయదు.. ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు.. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌజ్​లో విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పారు. మోదీ నాకు మంచి ఫ్రెండ్​.. నేను ఏది చెప్పినా చేస్తాడు అనే ధోరణిలో ట్రంప్​వ్యాఖ్యలు చేశారు.  మోదీ భయపడుతున్నాడు కాబట్టే..ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా ఛాన్స్​ ఇస్తున్నారని విమర్శించారు రాహుల్.  ​