ఉక్రెయిన్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల తరలింపుపై ప్రధానంగా చర్చించారు. తూర్పు ఉక్రెయిన్ లోని సుమీ నగరంలో చిక్కుకున్న 700 మంది విద్యార్థుల తరలింపుపై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఖార్కివ్, పిసోచిన్ నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకుకొస్తామని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద ఇప్పటి వరకు 63 విమానాల్లో 13 వేల 300 మందిని తీసుకువచ్చామన్నారు.
#WATCH | PM Modi chairs a high-level meeting on the #Ukraine issue. pic.twitter.com/o80S9rcBI4
— ANI (@ANI) March 5, 2022
మరిన్ని వార్తల కోసం