ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2024 జనవరి 25న ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో తన మొదటి ఎన్నికల ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు. నాయకులు పాల్గొనేలా ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్పై ఫోకస్ చేసిన బీజేపీ అక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 14 స్థానాలకు గాను ఎనిమిది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. మరో ఆరు స్థానాల్లో ఓటమిపాలైంది. అయితే 2024 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా ప్లాన్ చేస్తుంది.
అందులో భాగంగానే బులంద్షహర్ నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిందని సమాచారం.ఈ ర్యాలీలో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొనేలా ఆ పార్టీ ప్రణాళికలు చేస్తుంది. ఈ ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగవచ్చునన్న ప్రచారం సాగుతోంది.