నెహ్రూ విలువలను పరిరక్షించడమే మా ధ్యేయం

నెహ్రూ విలువలను పరిరక్షించడమే మా ధ్యేయం

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్‌‌లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ ఆదర్శాలను, విలువలను కాపాడటానికి కృషి చేస్తామని రాహుల్ చెప్పారు. దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌‌లాల్ నెహ్రూకు నివాళులు అంటూ మోడీ ట్వీట్ చేశారు.

సోదరభావం, సమతౌల్యత, ఆధునిక దృక్పథంతో మన దేశానికి నెహ్రూ జీ పునాది వేశారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన విలువలను పరిరక్షించడమే తమ ప్రయత్నం అంటూ రాహుల్ పేర్కొన్నారు.