
ఆపరేషన్ సిందూర్ మామూలు సైనిక చర్య కాదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమేనని, ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు అది అర్థమైందని అన్నారు. భారత రక్షణ రేఖ ఇప్పుడెంతో సురక్షితంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. పంజాబ్ లోని ఆదంపూర్ సైనిక స్థావరాన్ని దర్శించిన ప్రధాని మోదీ సైనికులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు. త్రివిధ దళాల సిబ్బందికి దేశం తరఫున నా సెల్యూట్ అని ఈ సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ జయజయ ధ్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయని అన్నారు. భారత్ మాతాకీ జై నినాదాలతో శత్రు దేశం కంపించిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు:
- మన రక్షణ వ్యవస్థ ముందు పాక్ విఫలమయ్యింది
- ఉగ్రవాద స్థావరాలను మట్టిలో కలిపాం
- తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం..
- ఉగ్రవాదుల అడ్డాలను తునాతునకుల చేశాం
- టెర్రరిస్టుల ఇళ్లల్లోకి నేరుగా చొచ్చుకెళ్లాం
- కానీ వాళ్లు పిరికి పందలుగా దాక్కుని వచ్చారు
- వందకు పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టాం
- మన మిస్సైల్స్ తో పాకిస్తాన్ కు నిద్ర కరువైంది
- మనం దెబ్బ కొడితే ఉగ్రవాదులకు నిద్ర రావద్దు
- భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే
- మన సామర్థ్యం చూసి పాక్ కు కొన్ని రోజులు నిద్ర పట్టదు
- ఆపరేషన్ సిందూర్ తో దేశ గౌరవాన్ని కాపాడారు.
- మన ఎయిర్ బేస్ పై దాడి చేసేందకుపాక్ ప్రయత్నించింది
- పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ కుయుక్తులు చేస్తోంది
- ఆపరేషన్ సిందూర్ తో సిందూర్ తుడిచినవాళ్ల సంగతేంటో చూశాం
- పిన్ పాయింట్ గా టెర్రరిస్టుల అడ్డాలను ధ్వంసం చేశాం
- ఆపరేషన్ సిందూర్ లో జవాన్ల తెగువను అభినందిస్తున్నాను
- వీరుల దర్శనం దొరికితే జన్మధన్యం అయినట్లే
- వీరుల దర్శనం కోసమే మీ దగ్గరికి వచ్చా
- దేశమంతా మీతోనే ఉంది
- భవిష్యత్తులో అందరూ మీగురించి మాట్లాడుకుంటారు
- ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాం
- న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు మేము భయపడం
- నిజాయితీ, విధానం, సామర్థ్యం.. ఇదే మన త్రివేణి సూత్రం