అమరవీరులను అవమానించిన మోడీ క్షమాపణ చెప్పాలి

అమరవీరులను అవమానించిన మోడీ క్షమాపణ చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అమరవీరులను అవమానించారని మండిపడ్డారు. అమరవీరులకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో మోడీ చేసిన ప్రసంగం రెండు వాస్తవాలను బయటపెట్టిందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మోడీ వ్యాఖ్యలతో రెండు విషయాలు స్పష్టమయ్యాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ తప్ప టీఆర్ఎస్ కాదని, బీజేపీ తెలంగాణను ద్వేషిస్తుందని, ఆ పార్టీ తెలంగాణ కోసం ఏమీ చేయలేదని రుజువైందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీలో వర్ష బీభత్సం

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు