ఒకే రోజున రూ, 24 వేల470 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన

ఒకే రోజున రూ, 24 వేల470 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ 2023 ఆగస్టు 06న వర్చువల్‌గా  శంకుస్థాపన చేయనున్నారు. 

వీటిలో ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో 55, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్‌, తెలంగాణలో 21, ఝార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 18, హరియాణాలో 15, కర్ణాటకలో 13 స్టేషన్లు ఉన్నాయి.  రూ, 24 వేల 470 కోట్ల ఖర్చుతో చేపట్టనున్నారు.  

నగరానికి ఇరువైపులా అనుసంధానం ఉండేలా ఆయా స్టేషన్లను సిటీ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు.. రైల్వే స్టేషన్‌ కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.