
ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దీని గురించి ప్రాథమిక రిపోర్టును కేంద్రమంత్రులు వివరించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. . రైలు ప్రమాద బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.