మోదీది ఫక్తు రాజకీయ పర్యటన..ప్రధాని హోదాలో వచ్చి.. బీజేపీ అధికారంలోకి వస్తుందనడం ఏంటి?: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మోదీది ఫక్తు రాజకీయ పర్యటన..ప్రధాని హోదాలో వచ్చి.. బీజేపీ అధికారంలోకి వస్తుందనడం ఏంటి?: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • విభజన హామీలు, నిధులు, విధుల గురించి మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్య

నిజామాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీది ఫక్తు రాజకీయ పర్యటన అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​ గౌడ్​ విమర్శించారు. దేశ ప్రధాని హోదాలో హైదరాబాద్ వచ్చిన ఆయన.. బీజేపీ పార్టీ నేతగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలు,  నిధులు, విధుల గురించి మాట్లాడకుండా పొలిటికల్ కామెంట్స్​తో స్థాయిని తగ్గించుకున్నారని విమర్శించారు. ప్రధాని హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడం ఏమిటని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తే చాన్సేలేదన్నారు. దేశ ప్రధానిగా ఏ స్టేట్​కు వెళ్లినా అక్కడ ఇచ్చే ఫండ్స్​, అభివృద్ధి గురించి చెప్పాలని.. కానీ, మోదీ అలా చేయలేదన్నారు.

సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్​ సర్కార్ లో​తెలంగాణలో అన్ని వర్గాలు సంక్షేమ పథకాల  లబ్ధి పొందుతున్నారన్నారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని,  వచ్చే ఎన్నికల్లో మళ్లీ  కాంగ్రెస్సే​అధికారంలోకి వస్తుందన్నారు.  92 లక్షల సెక్యులర్​ ఓట్లు తొలగించి బెంగాల్‌‌లో ​గెలిచిన్రు బెంగాల్‌‌లో​గెలుపు గురించి గొప్పగా  చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అక్కడ  92 లక్షల సెక్యులర్​ ఓట్లు తొలగిం చిన విషయం ఎందుకు చెప్పడంలేదని  మహేశ్​​గౌడ్​ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కుట్రలతో అధికారంలోకి వచ్చారన్నారు.   తెలంగాణలో కూడా ఓట్లు తొలగించాలని చూస్తున్నారని,  వారి ఆటలు రాష్ట్రంలో సాగనివ్వమన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీ సమాన దూరం

కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్ ఒక్కటేనని మహేశ్​గౌడ్​అన్నారు. ఫక్తు మత రాజకీయాలు చేసే బీజేపీతో ​సెక్యులర్​ విధానాలు పాటించే  కాంగ్రెస్​ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీతో కాంగ్రెస్​ కలిసి పోయిందంటున్న బీఆర్​ఎస్​ ఆరోపణలు  జోక్ ​అని కొట్టిపారేశారు.  తాము బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలకు  సమాన దూరంగా ఉంటామని చెప్పారు. కేసీఆర్​ పాలనలో వరి వేస్తే ఉరి అన్నారని.. వాళ్లు  వడ్ల కొనుగోలుపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్, శేఖర్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.