సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ.  ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని. 

ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకులను మాత్రమే అనుమతించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రధాని. పూజల తర్వాత మోదీకి ఆశీర్వచనం చేశారు పూజారి. అమ్మవారి వస్త్రంతో తో పాటు మహంకాళి ఫొటో ఫ్రేమ్ ను మోదీకి బహుకరించారు.  

బెంగళూరు పేలుళ్లతో సికింద్రాబాద్ పరిసరాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు SPG సిబ్బంది. ఆలయం నుంచి నేరుగా.... బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్నారు  మోదీ. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి బయల్దేరనున్నారు ప్రధాని.