పీఎన్‌‌‌‌బీ ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లపై తగ్గిన వడ్డీ

పీఎన్‌‌‌‌బీ ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లపై తగ్గిన వడ్డీ

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌‌‌బీ)  విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తున్న ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేట్లను  20 బేసిస్ పాయింట్లు (0.20 శాతం) తగ్గించామని మంగళవారం ప్రకటించింది.  విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  

విద్యాలక్ష్మి స్కీమ్ కింద  హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్‌‌‌‌కు లోన్లను ఇస్తోంది.  ఇండియా అంతటా ఉన్న860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ (క్యూహెచ్‌‌‌‌ఈఐ) లో మెరిట్ బేసిస్‌‌‌‌లో అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్‌‌‌‌కు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేటు  7.5 శాతం నుంచి మొదలవుతుంది.