
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తున్న ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు (0.20 శాతం) తగ్గించామని మంగళవారం ప్రకటించింది. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
విద్యాలక్ష్మి స్కీమ్ కింద హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్కు లోన్లను ఇస్తోంది. ఇండియా అంతటా ఉన్న860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (క్యూహెచ్ఈఐ) లో మెరిట్ బేసిస్లో అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్కు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్లపై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి మొదలవుతుంది.