
దుండిగల్, వెలుగు: పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి అమరావతి తీర్పు చెప్పారు.దుండిగల్ పరిధిలో 2018లో ఓ బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బోరంపేటకు చెందిన కోమరి శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తాను ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేశానని, తర్వాత ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు. ఆమె పలుమార్లు ఫోన్ చేయగా.. బెదిరించానన్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నాడు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన అప్పటి పోలీసులు కోర్టులో చార్జిషీట్దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం శివకుమార్కు కోర్టు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.