
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోలీసులు వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అచ్చంపేట, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని సీఈవో వికాస్రాజ్కు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్లో అర్ధరాత్రి కాంగ్రెస్అభ్యర్థి మధు యాష్కీ ఇంటిపై పోలీసులు అకారణంగా దాడి చేశారన్నారు.
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి.. కొడంగల్లో రేవంత్ను ఓడించేందుకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారని, పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయారన్నారు. రివర్స్లో మధుయాష్కీపై వనస్థలిపురం ఏసీపీ, హయత్నగర్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న మల్రెడ్డి రంగారెడ్డి, పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాళ్లదాడికి పాల్పడ్డారని తెలిపారు.
కానీ, ఇబ్రహీంపట్నం సీఐ, ఏసీపీ కాంగ్రెస్ అభ్యర్థిపైనే కేసు పెట్టారన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై సీఐ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలపై స్పం దించి.. కాంగ్రెస్ అభ్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే, ముస్లిం మైనారిటీ డిక్లరేషన్ కోసం ఆలయాల భూములు అమ్ముతామంటూ రేవంత్ కామెంట్ చేసినట్టు బీజేపీ, బీఆర్ఎస్ఫేక్ న్యూస్సర్క్యులేట్ చేస్తున్నాయని సైబర్ క్రైమ్ వింగ్కు ఫిర్యాదు చేశారు.
ఓటర్లను తప్పుదోవ పట్టిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు చరణ్, కౌశిక్ యాదవ్ తదితరులు పోలీసులను కోరారు.