
కామారెడ్డి, వెలుగు: ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు. బిహార్, వెస్ట్ బెంగాల్, చత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణకు చెందిన 12 మంది సభ్యుల్లో 8 మందిని అరెస్టు చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీస్లో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలను వెల్లడించారు.
కామారెడ్డిలోని ఓ వైన్స్లో సెప్టెంబర్ 23న రామేశ్వర్పల్లికి చెందిన సిద్ధాగౌడ్ 2 ఫేక్ రూ.500 నోట్లు ఇచ్చి మధ్యం కొన్నాడు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించగా ఫేస్బుక్ ద్వారా వెస్ట్ బెంగాల్కు చెందిన సౌవర్ డేను సంప్రదించి నకిలీ నోట్లను తెప్పించుకున్నట్లు చెప్పాడు.
సీసీఎస్, కామారెడ్డి టౌన్, సదాశివనగర్ సీఐలతో 8 బృందాలు ఏర్పాటై దర్యాప్తు ముమ్మరం చేశాయి. వెస్ట్ బెంగాల్, బిహార్, యూపీ, మహారాష్ట్రకు వెళ్లి 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. ముఠా నుంచి రూ.3,08,300 ఫేక్ కరెన్సీ, రూ.15,300 ఒరిజినల్ కరెన్సీ, కారు, 9 ఫోన్లు, బాండ్ పేపర్లు, కరెన్సీ ప్రింటింగ్కు ఉపయోగింగిన ప్రింట్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సీ చైతన్యరెడ్డి, సీఐలు శ్రీనివాస్, నరహరి, సంతోష్, ఎస్సైలు రాజు, రాజశేఖర్, అనిల్, ఉస్మాన్కు ఎస్పీ రివార్డులు అందజేశారు.