జీడిమెట్ల, వెలుగు: పీజీ హాస్టల్లో దూరి ల్యాప్టాప్లు దొంగతనం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గంగనమోని అన్వేశ్ కుమార్ (20) కొంపల్లిలోని ఎక్సలెంట్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. సికింద్రాబాద్కు చెందిన మయూర్ అశోక్ మేవాడ (46) బిజినెస్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి జనవరి 24న బహదూర్పల్లిలోని ఓ పీజీ హాస్టల్లో రెండు, 26న మరో ఐదు ల్యాప్ టాప్లు ఎత్తుకెళ్లారు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆదివారం బహదూర్పల్లి క్రాస్రోడ్స్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అన్వేశ్, అశోక్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 ల్యాప్టాప్లు రికవరీ చేశారు.
