సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల నజర్..బుల్లెట్ వాహనాల సైలెన్సర్లు తుక్కు తుక్కు

సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల నజర్..బుల్లెట్  వాహనాల సైలెన్సర్లు తుక్కు తుక్కు

సౌండ్​ పొల్యూషన్ పై  పోలీసులు దృష్టి సారించారు.  భారీ శబ్దాలతో సౌండ్​ పొల్యూషన్​ కు కారణం అవుతున్న వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్​ వాహనాలను  అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బిగించిన శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్​వాహనాలను సైలెన్సర్లను తొలగించి బుల్డోజర్లు తొక్కించారు.మోతాదుకు మించి సౌండ్​ దాటితే వేటు తప్పదని, రూల్స్​ అతిక్రమించే మెకానిక్​ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

సోమవారం (జవనరి 12)  తాండూరు పోలీస్​ స్టేషన్​ లో డీఎస్పీ నర్సింగ్ యాదవ్​ ఆధ్వర్యంలో వాహన దారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఎక్కువ శబ్దాలు చేసే వాహనాలు నడపడం నిబంధనలకు విరుద్ధమని నర్సింగ్ యాదవ్​ అన్నారు. 

►ALSO READ మున్సిపల్ వార్డులలో.. కొత్తగా సీసీ రోడ్లు..మంత్రి వివేక్ వెంకటస్వామి

వాహనదారులు ప్రత్యేక సైలెన్సర్లను అమర్చుకుని భారీ శబ్దాలు చేస్తూ కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. వాహనాలకు సౌండ్ సైలెన్సర్లను అమర్చే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మెకానిక్ షాపుల నుంచి, వాహనదారుల నుంచి స్వాదీనం చేసుకున్న సైలెన్సర్లను జేసీబీ యంత్రంతో  తుక్కు తుక్కు చేయించారు.