అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు యత్నం.. సీపీఐ నేతలు అరెస్ట్

అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు యత్నం.. సీపీఐ నేతలు అరెస్ట్

హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని హైదరాబాద్ లో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీలో అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీపీఐ నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.