కాంగ్రెస్​ నేతల బైక్ ర్యాలీ.. అరెస్ట్​ చేసిన పోలీసులు

కాంగ్రెస్​ నేతల బైక్ ర్యాలీ.. అరెస్ట్​ చేసిన పోలీసులు

సీఎం కేసీఆర్​ ఆగస్టు 23న మెదక్​ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తుండగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ  కాంగ్రెస్​నేతలు స్థానిక డబుల్​బెడ్రూం ఇళ్ల నుంచి బైక్​లపై ర్యాలీగా బయల్దేరారు. 

సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. కేసీఆర్​ పర్యటన వేళ అటు టికెట్టు ఆశించి భంగపడిన మైనంపల్లి రోహిత్​వర్గీయులు ఓ వైపు, కాంగ్రెస్​నేతలు మరో వైపు నిరసనలు చేస్తుండటంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.