- పారిపోతున్న యువకులను పట్టుకునేందుకు గన్ ఫైరింగ్
- నలుగురు అరెస్ట్.. మెట్టుగూడలో ఘటన
పద్మారావునగర్, వెలుగు : చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వరుస చోరీలు, హత్యల నేపథ్యంలో ఏఆర్, క్రైమ్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెట్టుగూడ ప్రాంతంలో డెకాయి ఆపరేషన్చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత 2.40 గంటల ప్రాంతంలో కొందరు పోలీసులు మఫ్టీలో ఫుట్పాత్పై మాటువేశారు.
అదే టైంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు మఫ్టీ పోలీస్జేబులో చోరీకి యత్నించారు. పోలీసులు అలర్ట్అవడంతో పరుగులు తీశారు. వారిని పట్టుకునేందుకు ఓ కానిస్టేబుల్ తన చేతిలోని గన్తో గాలిలోకి కాల్పులు జరిపారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నలుగురూ స్టూడెంట్లని పోలీసులు గుర్తించారు. వారికి ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగేందుకు వచ్చారని చెప్పారు.
