భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ పర్యవేక్షణలో కాంకేర్ జిల్లాలో మంగళవారం భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లాలోని కోయిలీబేడా, పర్తాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని గుంచూర్, ఫదాలాంసీ గ్రామ సమీపంలోని గుట్టల్లో స్థానిక పోలీసులు, డీఆర్జీ, బీఎస్ఎఫ్, బీడీఎస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టుల డంప్లు బయటపడ్డాయి.
303 రైఫిల్స్, ఎస్ఎల్ఆర్ తుపాకులు, తూటాలు, మ్యాగజైన్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, టిఫిన్ బాక్సు బాంబులు, పవర్ కంట్రోలర్లు, వైర్, విప్లవ సాహిత్యం దొరికాయి. సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు బస్తర్ దండకారణ్యంలో డంప్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఐజీ తెలిపారు.
