జగిత్యాలలో భారీగా దొంగనోట్లు స్వాధీనం

జగిత్యాలలో భారీగా  దొంగనోట్లు స్వాధీనం

జగిత్యాలలో భారీగా దొంగనోట్ల పట్టుకున్నారు పోలీసులు. రూ. 15 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో దొంగనోట్ల మార్పిడి జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన శేఖర్, జన్నారంకు చెందిన రాధాకిషన్, గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ గౌడ్, ఎల్కతుర్తికి చెందిన శ్రీకాంత్ బిక్షపతిలు ముఠాగా దొంగనోట్లు మారుస్తున్నారు. గతంలో వీరు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నష్టపోయారని పోలీసులు చెప్తున్నారు.

ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు దొంగ నోట్ల మారుస్తున్నారని తెలిపారు పోలీసులు.  నిందితులను అదుపులోకి తీసుకోని విచారించారు. వీరి నుంచి 15 లక్షల విలువైన 500 రూపాయల  దొంగ నోట్లు , 3 లక్షల ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం... 

ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు కుట్ర

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ