కస్టడీలోకి డీఏవీ స్కూల్  నిందితులు

కస్టడీలోకి డీఏవీ స్కూల్  నిందితులు

హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్  స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజినికుమార్, ప్రిన్సిపాల్ మాధవిలను ప్రశ్నించనున్నారు. 

కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అరెస్టయిన ప్రధాన నిందితులను లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు 4 రోజులపాటు ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది. 

నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయమే చంచల్ గూడ జైలుకు చేరుకున్న పోలీసులు రిమాండులో ఉన్న నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవైపు కేసు విచారణ కొనసాగుతుంటే.. స్కూల్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకుని స్కూల్ నడపాలని డిమాండ్ చేస్తుండగా.. విద్యాశాఖ అధికారులు అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు.