![తాండూరులో రూ.3. 50 లక్షలు సీజ్](https://static.v6velugu.com/uploads/2023/10/police-inspections-are-continuing-in-wake-of-election-code_YPwRbkzD9c.jpg)
వికారాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిధి తాండూరు పట్టణంలోని శాంతిమహల్ థియేటర్ రోడ్ లో వ్యాపారి పురుషోత్తం కారులో రూ.3 లక్షల 50 వేలను పోలీసులు గుర్తించారు.
ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పేపర్లు చూపించకపోవడంతో వాటిని స్క్రీనింగ్ కమిటీకి అప్పజెప్పినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.