
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై, రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం, రెండో రోజు విచారణ చేపట్టింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 18న సోమవారం ఉదయం నుంచి ప్రణీత్రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు.
ప్రణీత్ రావు సెల్ ఫోన్, లాప్ టాప్ లో ఉన్న డేటాను అధికారులు రిట్రివ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకెళ్లిన పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, రికార్డ్స్ మాయం చేసిన తీరు గురించి.. పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. మరోవైపు సిరిసిల్లలో ఉన్న ప్రణీత్ రావు నివాసానికి వెళ్లారు పోలీసులు. ప్రణీత్ రావు ఇంట్లో డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ పొలిటికల్ పార్టీ నేతల ఫోన్లు టాప్ చేసినట్టు ప్రణీత్ రావు కన్ఫమ్ చేశారు. అతని కన్ఫెక్షన్ తో పాటు దానికి తగ్గ ఆధారాలు సేకరిస్తున్నారు. వార్ రూమ్ ల ఏర్పాటుపై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.