
- ట్యాంక్ బండ్పై రోడ్డుకు అడ్డుగా ఉన్న వారిపై లాఠీచార్జ్
ఎంజే మార్కెట్ వద్ద వాహనదారుడిని ఈడ్చుకెళ్లిన ట్రాఫిక్ ఎస్ఐ పాండుబషీర్బాగ్, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు సహనం కోల్పోయి ప్రవర్తించారు. నిమజ్జనానికి వచ్చిన వారిపై లాఠీలు ఝలిపించారు. శనివారం రాత్రి అప్పర్ ట్యాంక్బండ్పై రోడ్డుకు అడ్డంగా కొందరు సౌండ్ పెట్టి, ముందుకు జరగకుండా డ్యాన్స్లు వేస్తున్నారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
అలాగే ఎంజే మార్కెట్వద్ద నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని, హాస్పిటల్కు వెళ్లాల్సి ఉందన్న ఓ వాహనదారుడిపై అబిడ్స్ ట్రాఫిక్ ఎస్ఐ పాండు రాజుతో పాటు మరికొందరు పోలీసులు చేయి చేసుకొని, పక్కకు ఈడ్చుకెళ్లారు.