
జగిత్యాల, వెలుగు: గ్రామంలో రోడ్డు సమస్య పరిష్కారం కోసం వెళ్లిన పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి.. నిప్పు పెట్టాడో వ్యక్తి. ఈ ఘటనలో ఎంపీవో తీవ్రంగా గాయపడగా.. ఎస్ఐ తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో చుక్క గంగాధర్, తిరుపతి అనే ఇద్దరి మధ్య మట్టి రోడ్డు విషయమై ఏడాదిగా వివాదం నడుస్తోంది. గ్రామంలోని 20 కుటుంబాలు ఇదే దారి నుంచి ఊళ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ దారి తనదేనని, ఎవరూ అటుగా పోవడానికి వీల్లేదని గంగాధర్ చాలారోజులుగా కర్రలు అడ్డంపెడుతున్నాడు. అది గంగాధర్జాగా కాదని, తొవ్వ అని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అయినా దారి వదలని గంగాధర్ఆ భూమిని తన పేరున రిజిస్ట్రేషన్చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. గ్రామస్తులు ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రోడ్డు గుండా ఎవరూ వెళ్లకుండా గంగాధర్ కర్రలు అడ్డంగా పెట్టాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం గ్రామానికి వస్తున్నట్టు గంగాధర్ తెలుసుకున్నాడు. పురుగు మందు పిచికారీ చేసే డబ్బాలో పెట్రోల్పోసి రెడీగా పెట్టుకున్నాడు. అధికారులు వచ్చి కర్రలు తొలగిస్తుండగా బీర్పూర్ఎస్ఐ గౌతమ్పై గంగాధర్ పెట్రోల్స్ప్రే చేశాడు. ఆయన తప్పించుకోగా బీర్పూర్ఎంపీవో రామకృష్ణపై పెట్రోల్పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో ఆయన అక్కడ్నుంచి పరిగెత్తుతూనే షర్ట్ విప్పేశాడు. వెంటనే అక్కడున్నోళ్లు మంటలు ఆర్పేశారు. రామకృష్ణను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. గంగాధర్ను అరెస్ట్ చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలె
హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో ఉన్న అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పంచాయతీ సెక్రటరీల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్ , విజయ్, పంచాయతీ సెక్రటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.