బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 3లక్షల 13వేల విలువైన మద్యం సీజ్

బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 3లక్షల 13వేల విలువైన మద్యం సీజ్

సైబరాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న  బెల్ట్ షాపులపై ఎస్వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న రాత్రి(2024 మార్చి 23) SOT టీమ్స్ దాడులు చేసింది. ఇందులో భాగంగా 12 బెల్ట్ షాప్ ల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3లక్షల 13వేల 500వందల- విలువ గల 285 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అన్నింటికంటే అత్యధికంగా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 128 లీటర్ల మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. నిందుతులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.