ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లపై కేసు నమోదు

ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లపై కేసు నమోదు

బెయిల్ ఇప్పిస్తామని మోసం చేసిన వ్యవహారంలో..

 అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు

జగిత్యాల, వెలుగు: సూసైడ్​ కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్ ​ఇప్పిస్తామని నమ్మించిన ముగ్గురు టీఆర్ఎస్​ లీడర్లు రూ.1.10 లక్షలు తీసుకున్నారు. తీరా బెయిల్​ ఇప్పించకపోవడంతో బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. పదిరోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్​ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలివి.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో మూడు నెలల క్రితం జక్కుల సమత (20) సూసైడ్​ చేసుకుంది. సమత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సమత భర్త జక్కుల మహేశ్​తో పాటు అత్తమామలపై కేసు నమోదు చేశారు.

కాగా, ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు కొత్తపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌‌‌‌వీ కో ఆర్డినేటర్ రామడుగు రాజేశ్, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు సతీష్, మాజీ సర్పంచ్ భర్త రవి కలిసి తన నుంచి రూ.1.10 లక్షలు తీసుకున్నారని మహేశ్​తాజాగా పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. రాజేశ్ అదనంగా రూ.6 లక్షలు అడగడంతో తాను వేరే అడ్వకేట్‌‌‌‌ను మాట్లాడుకుని రెండు వారాల క్రితం బెయిల్​పై వచ్చానని చెప్పాడు. కాగా, ముగ్గురు టీఆర్​ఎస్​ లీడర్లపై  ఈ నెల 18న కేసు నమోదైనా ఇంకా అరెస్టు చేయలేడం లేదని వాపోయాడు. అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నాడు.