- రెగ్యులర్గా రెంట్ కడుతూ అనుమానం రాకుండా జాగ్రత్తలు
- ఎట్టకేలకు చిక్కిన ముగ్గురు స్టూడెంట్స్
- పరారీలో ప్రధాన నిందితుడు..
- మాదాపూర్పీఎస్పరిధిలో ఘటన
మాదాపూర్, వెలుగు : ఆ నలుగురు యువకులు స్టూడెంట్స్. అందరిదీ ఒకే ఊరు. విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం పక్కదారి పట్టారు. కార్లను రెంట్కు తీసుకొని అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని తక్కువ ధరకు అమ్మేసి వచ్చిన డబ్బులతో ఎంజాయ్చేస్తున్నారు. గతంలో రెంట్కు తీసుకున్న కార్లను తిరిగి ఇవ్వకుండా రెంట్కడుతూనే మరో కారు కావాలని వెళ్లగా అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు కంప్లయింట్ఇచ్చారు. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్చేశారు. సుమారు రూ.కోటి విలువ చేసే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు వివరాలను హైదరాబాద్లోని మాదాపూర్జోన్ఏసీపీ శ్రీకాంత్ బుధవారం వెల్లడించారు. రామగుండం ప్రాంతానికి చెందిన హరీశ్, అభిషేక్, కొమలేశ్వర్, ప్రేమ్కుమార్ ఫ్రెండ్స్. అందరూ డిగ్రీ, ఎంబీఏ చదువుతున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ వీరు ఈజీ మనీ కోసం కార్లను రెంట్కు తీసుకొని అమ్మేయాలని ప్లాన్వేసుకున్నారు. గతంలో హరీశ్మాదాపూర్లోని లాంగ్ డ్రైవ్కార్స్లో కార్లను రెంట్కు తీసుకునేవాడు. ఒకసారి ఓ కారును తీసుకుని టైంకు ఇవ్వకపోవడంతో హరీశ్కార్డును బ్లాక్ చేశారు. దీంతో ఫ్రెండ్స్అయిన అభిషేక్, కోతమలేశ్వర్రావు, ప్రేమ్కుమార్లను కార్లు రెంట్కు తీసుకోవాలని లాంగ్ డ్రైవ్కార్స్ అఫీస్కు పంపించేవాడు. వీరంతా అభిషేక్ఐడీ ప్రూఫ్తో కార్లను బుక్ చేసేవారు. తీసుకున్న కార్లను హరీశ్కు ఇచ్చేవారు. దీంతో హరీశ్ ఆ కార్లను అదిలాబాద్కు తీసుకువెళ్లి గుర్తు తెలియని వ్యక్తులకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బుల్లో అభిషేక్, కొమలేశ్వర్రావు, ప్రేమ్కుమార్లకు రూ.35వేల నుంచి 50వేల వరకు కమిషన్ఇచ్చేవాడు. పదిరోజుల వ్యవధిలో ఒక్కో కారు తీసుకుంటూ రెండు నెలల్లో ఐదు కార్లు తీసుకున్నారు.
అయితే, తీసుకున్న కారు రేంజ్ను బట్టి రూ.1000 నుంచి 6వేల వరకు రెంట్పక్కాగా కట్టేవారు. దీంతోపాటు జీపీఎస్లో కూడా కార్లు తిరుగుతున్నట్టు కనిపిస్తుండడంతో యాజమాన్యానికి అనుమానం రాలేదు. మార్చి 23న అభిషేక్ మళ్లీ తన ఐడీ ప్రూఫ్పెట్టి మహీంద్రా థార్ కారు బుక్ చేసుకున్నాడు. ఐడీ చెక్చేస్తుండగా ఇప్పటివరకు ఐదు కార్లు అభిషేక్ పేరుతోనే తీసుకోవడం, ఒక్క కారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అభిషేక్, కోమలేశ్వర్, ప్రేమ్కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. వీరి నుంచి రూ.కోటి విలువైన రెండు మహీంద్రా థార్లు, మారుతి ఎర్టిగా, ఇకోస్పోర్ట్స్, హుందాయ్ క్రెటా కార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హరీశ్పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.మాదాపూర్సీఐ మల్లేశ్, ఎస్ఐ వెంకట్ పాల్గొన్నారు.