- పథకాల లబ్ధిదారులతో టీఆర్ఎస్ సమ్మేళనాలు, భోజనాలు
- మీటింగ్స్కు రాకుంటే పథకాలు రావంటూ బెదిరింపులు
- టీఆర్ఎస్కు ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకోండి: ఎమ్మెల్యే కోరుకంటి చందర్
నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విందు రాజకీయాలకు తెరలేపింది. అధికార పార్టీ నేతలు మండలాల వారీగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అందరినీ మీటింగ్కు పిలిచి.. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్కే ఓటు వేయాలని చెబుతున్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆర్ కిట్, రైతుబంధు తదితర స్కీమ్ల కింద లబ్ధి పొందిన వారి వివరాలను పార్టీ లీడర్లు సేకరించారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వారందరినీ పిలిచి భోజనాలు పెడుతున్నారు. మీటింగ్ లకు రాకుంటే పింఛన్లు, స్కీమ్లు రావని లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.
లబ్ధిదారులంతా కారుకే ఓటేయాలి: చందర్
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే, హాలియా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కోరుకంటి చందర్ సూచించారు. మంగళవారం హాలియాలో వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందిన వారితో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా గౌరవంగా బతుకుతున్న లబ్ధిదారులంతా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.