పండుగ పూట పొల్యూషన్..ప్రత్యేక డ్రైవ్ చేసిన పీసీబీ

పండుగ పూట పొల్యూషన్..ప్రత్యేక డ్రైవ్ చేసిన పీసీబీ
  • క్యూఐ ​168గా నమోదు
  • సౌండ్ పొల్యూషన్ ఎక్కువే..

హైదరాబాద్​, వెలుగు : దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్​లో గాలిలో నాణ్యత క్షీణించింది. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ రోజు ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​(ఏక్యూఐ) అధికంగా 168 నమోదైనట్టు పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​(పీసీబీ) తెలిపింది. సెంట్రల్​పీసీబీ ఆదేశాల మేరకు రాష్ట్ర పీసీబీ.. దీపావళి సందర్భంగా ఈనెల 6 నుంచి 19 వరకు ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాధారణ రోజుతో పోలిస్తే దీపావళి రోజు గాలిలో సల్ఫర్​డై ఆక్సైడ్​, నైట్రోజన్ స్థాయి పెరిగిందని తెలిపింది.

సాధారణంగా గాలిలో ప్రతి ఘనపు మీటరుకు 60 మైక్రోగ్రాముల ఫైన్​పార్టిక్యూలేట్​మ్యాటర్​( పీఎం 2.5) ఉండాలి. కానీ.. పండుగ రోజు అది 119గా నమోదైంది. అలాగే 100 ఉండాల్సిన  పీఎం10 కు 188గా నమోదైందని పీసీబీ తెలిపింది. అలాగే సౌండ్​పొల్యూషన్​సాధారణ రోజుల్లో ఇండస్ట్రీయల్​ఏరియాల్లో ఉండేదానికంటే దీపావళి రోజు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఎక్కువ నమోదైందని పేర్కొంది.